Monday 20 January 2014

పొదుపు

సౌమ్య కాసేపు కాలక్షేపానికి ఎక్జిబిషన్ గ్రౌండుకు వెళ్ళింది.అక్కడ ఒకకుటుంబం 20రూపాయలు పెట్టి జున్ను

కొనుక్కుని ఒకస్పూనుతో నలుగురు తిన్నారు.ఇంకొక కుటుంబం 10రూపాయలు పెట్టి లాలి పాప్ కొనుక్కుని

పెద్దవాళ్ళుఇద్దరు,పిల్లలుఇద్దరు ఒకళ్ళతర్వాతఒకళ్ళు నోట్లోపెట్టుకుని చీకుతున్నారు.మరొకళ్ళు 15రూపాయల

 బాదంపాలు తీసుకుని 4గురు ఒకే కప్పుతో త్రాగుతున్నారు.సౌమ్యకు ఇదంతా విచిత్రంగా ఉంది.ఇంతపొదుపు


మనదేశంలో ఎప్పటినుండి పాటిస్తున్నారు?అందరూ ఇంత పొదుపు పాటిస్తే మనదేశం అప్పులపాలవదు కదా

అన్పించింది.అసలు పాటించవలసినవాటిల్లో పొదుపు పాటిస్తే బావుంటుంది.పైన చెప్పినవన్నీ చూడటానికి

ఎబ్బెట్టుగా వుంటాయి.

No comments:

Post a Comment