Thursday 30 January 2014

వేలం వెఱ్ఱి

     జనం ఎంత వేలం వెఱ్ఱిగా ఉంటున్నారంటే చవగ్గా వస్తే చాలు అది పనికివచ్చినా రాకపోయినా ఫర్వాలేదుఅని
అనుకొంటున్నారు.ఇందుకునిదర్శనం నుమాయిష్ డ్వాక్రా బజారు.ఇసుకవేస్తేరాలనంతజనం.పొదుపుసంఘాల
వాళ్లకు ఉచితంగాస్టాలు ఇస్తే వాళ్ళు వేరేవాళ్ళకు అమ్ముకొంటారు.కొనుక్కున్నవాళ్లు ఎక్కడ చవగ్గా వస్తే అక్కడ
కొనుక్కొచ్చి ఇంట్లోతయారుచేశామనిచెప్పి ఎక్కువరేట్లకు అమ్మేస్తుంటే పిచ్చిజనాలు డ్వాక్రాలో చవగ్గాఉన్నాయి
అనుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు.తీరా ఇంటికి వెళ్ళాక చూస్తే పాడయిన వాసన వచ్చే నాసిరకం సరుకు ఉప్పగాఉన్నపచ్చళ్ళు,నిల్వఉన్నకారాలు వాసనవచ్చిన తినుబండారాలు అప్పటికిగానీ అర్దంకాదు.మార్కెట్ రేటుకన్నా చవగ్గాఎలా ఇవ్వగలరు?అనుకొంటే అలా నాణ్యతలేని వస్తువులు,మూతలులేని తినుబండారాలు
వేలం వెర్రిగా కొనరు.మంచి ఆహారం తినగలిగినవాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మూతలు లేకుండా బేసిన్లో ఉన్న
ఆహారం ప్లేట్లల్లో తెచ్చుకుని గొప్పగా తిరుగుతూ తింటున్నారు.    

No comments:

Post a Comment