Saturday 18 January 2014

బాదం పాలు

రుక్మిణి,రోహిణి స్నేహితులు.ఇద్దరూ కలిసి ఒకబ్రాండ్ పేరుతో  బాదం పాలు మార్కెట్లో ప్రవేశ పెట్టదలిచి
ప్రజల అభిప్రాయం తెలుసుకోవటానికి ఒకప్రదర్శనలో స్టాల్ పెట్టారు.1,2 రోజులు క్రొత్త బ్రాండు కనుక  అంతగా
ప్రజలు త్రాగలేదు కానీ తరువాతనుండి త్రాగటం మొదలుపెట్టారు.ఒకవారం అయ్యేటప్పటికి ఆస్టాల్ ముందు
 గుమికూడి మరీ అందరూబాదం పాలు కావాలంటున్నారు.చాలా రుచిగా ఉన్నాయి అని ఒక్కొక్కళ్ళు రెండు
త్రాగుతున్నారు.రుక్మిణి,రోహిణి  మనం అనుకున్నది సాధించగలిగామని సంతోషపడ్డారు.వీళ్ళ ఎదురుగా ఉన్న
స్టాలు అతను మొదటిరోజు బాదం పాలంటే అలా వుండాలి,ఇలావుండాలని విమర్శించాడు.4రోజుల తర్వాత
అందరూ బావున్నాయి అనుకోవటం విని వాడే వచ్చి ఒకటి త్రాగి చాలా బావున్నాయి ఇంకొకటి ఇవ్వండి అని
అడిగాడు.విమర్శించిన నోటితోనే చాలా రుచిగా ఉన్నాయి అని చెప్పి వెళ్ళాడు.

No comments:

Post a Comment