Tuesday 2 February 2016

ఇల్లు గుల్ల

                                                    సావిత్రికి బంగారు నగలంటే తగని మోజు.తన దగ్గర ఉన్న డబ్బు అవసరానికి అడిగారు కదా అని అన్నకు,అక్కకు ఇస్తే డబ్బు తిరిగి ఇవ్వకుండా చెల్లితో మాట్లాడటం మానేశారు.డబ్బు ఇచ్చి ఎదురు పగ ఎందుకులే అని ఎప్పటికప్పుడు ఉన్న డబ్బుతో బంగారం కొనుక్కోవడం మొదలుపెట్టింది.ఆడపిల్లలకు కూడా తలా 100 కాసులు పెట్టింది.తను కూడా ఒక 100 కాసులు పెట్టి రకరకాలుగా నగలు చేయించుకుంది.పిల్లలు విదేశాలలో ఉంటారు కనుక అమ్మ దగ్గరకు వచ్చినప్పుడు అమ్మ నగలు పెట్టుకుంటారు.చిన్నఅమ్మాయి మరిది పెళ్ళికి వచ్చి అమ్మ నగలు లాకరు నుండి తెచ్చిఅమ్మాకూతుళ్ళు పెట్టుకున్నాక ఇంట్లో పెట్టేసి లాకరులో పెట్టకుండా ఊరు వెళ్లారు.చిన్న అమ్మాయిని విమానం ఎక్కించి అటునుండిఅటు భార్యాభర్తలు యాత్రలకు వెళ్ళి 10 రోజులకు ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు గుల్లయింది.సావిత్రి 100 కాసుల నగలు దొంగలు మూట కట్టుకుని ఎవరికీ అనుమానం రాకుండా తలుపులు దగ్గరకు వేసి వెళ్ళి పోయారు.స్నేహితులు పరామర్శించటానికి వెళ్తే సావిత్రి లబోదిబో అంటూ పైసాపైసా కూడబెట్టి తినోతినకో బంగారం అమర్చుకుందామని నగలు చేయించుకుని దొంగల పాలు చేసినట్లయిందని భోరున ఏడుస్తుంటే చూడటానికి,వినటానికి కూడా చాలా భాధ అనిపించింది.

No comments:

Post a Comment