Friday 11 November 2016

ఏడుపు

                                                                  ఈమధ్య పెంపుడు జంతువులను ఇంటికి తెచ్చి పెంచితే అవి చేసే చేష్టలు,చూపే ప్రేమతో చాలావరకు ఒత్తిడి దూరమైపోతుందని తద్వారా ప్రశాంతత దొరుకుతుందని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.అందుకే సావిత్రమ్మ కూడా ముద్దుగా,బొద్దుగా ఉన్న ఒక బుల్లి తెల్ల కుక్కపిల్లను తెచ్చుకుని పెంచుకుంటుంది.దాని చేష్టలతో మురిసిపోతూ ఉండగానే సావిత్రమ్మకు మనవడు పుట్టాడు.అందరూ కుక్క పిల్లను ఎవరో ఒకరికి పెంపకానికి ఇవ్వమన్నా నేను కావాలని తెచ్చుకున్నాను కనుక ఎవరికీ ఇవ్వను అని సావిత్రమ్మ తెగేసి చెప్పింది.సావిత్రమ్మ శాఖాహారి.మనవడు పుట్టక ముందు కుక్కపిల్ల కోడికూర తప్ప తినేది కాదు.రోజూ దానికోసం కూర కొనుక్కొచ్చి మరీ పెట్టేవాళ్ళు.దానికి తెచ్చిన కూర ఎవరైనా పట్టుకున్నా అరిచేది.ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు.వాళ్ళల్లో ఒక పిల్లాడు  కోడికూర వేస్తేనే అన్నం తింటానని మారాం చేయడం మొదలు పెట్టాడు.కుక్కపిల్లకు వేడిగా కూర తెచ్చారు కదా!అని కొంచెం కూర బాబుకు పెట్టింది.ఇంతలో కుక్కపిల్ల దానికి తెచ్చిన కూర పెట్టడం ఏమిటని ఒకటే ఏడుపు.ఆ పిల్లాడి పళ్ళెంలో ఉన్న కోడికూర తీసి దాని పళ్ళెంలో పెట్టేవరకు ఏడుపు ఆపలేదు.మిగతా వాళ్ళకు విచిత్రంగా అనిపించినా సావిత్రమ్మకు దాని తత్వం తెలుసు కనుక మారు మాట్లాడకుండా మళ్ళీ కూర తెప్పించి ఆ పిల్లాడికి పెట్టింది.

No comments:

Post a Comment