Monday 21 November 2016

ఎల్లి బద్ద

                                                                      చెన్నమ్మ అత్తారింటికి కాపురానికి వెళ్ళినప్పుడు నాలుగు నిట్టాళ్ళ పాక ఉండేది.దాన్నేనాలుగు గదులుగా చేసి అత్త,బావ,చెన్నమ్మ,మరిది తలా ఒక గదిలో ఉండేవారు.కొన్నాళ్ళకు పాకకు ఉండే వెన్ను బద్ద  విరిగిపోయింది.చెన్నమ్మ మేనమామ వచ్చి వెన్ను బద్ద విరిగిన ఇంట్లో ఉంటే ఎవరో ఒకళ్ళ ప్రాణానికి ముప్పు వెంటనే తీసేసి మరొకటి వేయించుకోవాలి అని చెప్పాడు.ఆ విషయం చెన్నమ్మ అత్తతో చెప్పగానే గయ్,గయ్ మంటూ కోడలిపై ఒంటి కాలి మీద లేచి నువ్వు తెచ్చిన డబ్బు కట్టలు కట్టలు ఇక్కడ మూలుగుతూ ఉన్నదని ఎల్లి బద్ద కొత్తది వేయించమంటావా?ఎవరు చనిపోయినా సరే కొత్తది వేయించేది లేదు అంది.మంచిది కాదని తెలిసినా బిక్కుబిక్కు మంటూ అందరితోపాటు ఉంది చెన్నమ్మ.ఇంతలో రెండు నెలలకే చెన్నమ్మ మామ,బావ కూడా చనిపోయారు.మరిదికి కూడా జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉన్నాడు.అప్పుడు కానీ చెన్నమ్మ అత్తలో మార్పూ రాలేదు.చెన్నమ్మను పిలిచి నువ్వు చెప్పింది నిజంగానే జరిగింది.కొత్త ఎల్లి బద్ద కొనుక్కొచ్చి రేపు వేద్దాము అని చెప్పింది.ఆ మాట వినగానే చెన్నమ్మకు ఎక్కడి లేని ఉత్సాహము వచ్చి చిన్నపిల్లలా గెంతులు వేసినంత పని చేసింది.

No comments:

Post a Comment