Tuesday 22 November 2016

చలికాలంలో చర్మం

                                                              చలికాలంలో మా సబ్బు వాడితే మీ చర్మం ఎంతో నునుపుగా ఉంటుంది అంటూ బుల్లితెరపై వచ్చే ప్రకటనలు చూచి మోసపోయి ఆ సబ్బులు కొనుక్కుని వాడుకున్నాఇంకా చర్మం కాంతి విహీనంగా,తెల్లగా పొట్టు రాలిపోతున్నట్లు ఉంటుంటే ఏమి చేయాలో తెలియక బాధపడిపోతూ ఉంటాము.దానికి బదులుగా మన ఇంట్లోనే సహజంగా వాడుకునే  పండ్లు,కూరగాయలు,పెరుగు,పాలు,కొబ్బరినూనె,తేనెతో ఒకదానితో ఒకటి కలిపి రకరకాల పూతలతో చర్మాన్ని నునుపుగా ఉండేలా చేయవచ్చు.అదెలా అంటే పాలపై ఉన్న పల్చటి మీగడ తీసి రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి,మెడకు,చేతులకు రాసి ఒక పది నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీళ్ళతో కడిగితే చర్మం నునుపుగా ఉంటుంది.పెరుగు,తేనె కలిపి ఒకసారి,బాగా మగ్గిన అరటిపండు మెత్తగా చేసి ఒక స్పూనుతో తీసుకుని ఒక పావు స్పూను తేనె కలిపి మరొకసారి,కమలా రసం తేనె కలిపి ఇంకొకసారి పూతలా వేసి ఒక పది ని.లు ఉంచి కడిగేయాలి.అలా ఒక పది ని.లు రోజుకొకసారి చేస్తే చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుంది.అలాగే కారట్ తురిమి లేదా మిక్సీలో వేసి కొద్దిగా గుజ్జులో తేనె కలిపి రాసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.రోజూ చలికాలంలో రాత్రి పడుకునే ముందు పెదవులకు మీగడ,నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకుంటే మృదువుగా ఉంటాయి.తేనె అప్పుడప్పుడు రాస్తే పెదవుల నలుపుదనం తగ్గుతుంది.  

No comments:

Post a Comment