Friday 18 November 2016

బొట్టు

                                              నుదుట గుండ్రని బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం.ఆడవాళ్ళు,మగవాళ్ళు పూర్వం నుదుట బొట్టు లేకుండా ఉండేవారు కాదు.మగవాళ్ళ మాట దేముడెరుగు నేడు చాలామంది ఆడవాళ్ళు కూడా నుదుట బొట్టు పెట్టుకోవడం లేదు.పెద్దవాళ్ళు చెప్పినా చాదస్తం అనుకునే రోజులు.కలికాలం కదా!ఎవరినీ ఏమీ అనకూడని రోజులు.ఎవరి ఇష్టం వారిదన్నట్లు చూసీ చూడకుండా వదిలేయడమే అని అనుకున్నా చూస్తూ వదిలేయలేము బొట్టు నుదుటికి అందం తీసుకురావడమే కాకుండా బొట్టు పెట్టుకుంటే ఎదుటి వారి దృష్టి ముందుగా కొట్టొచ్చినట్లు కనిపించే బొట్టుపై పడుతుంది.నరుడి కంటికి నల్లరాయి నుగ్గయి (బద్దలై)పోతుందని పెద్దల మాట.మన బంధువులైనా,స్నేహితులైనా,ఇరుగు పొరుగు,ఇంకా వేరే ఎవరైనా సరే ఒక్కొక్కరి చూపు ఒక్కొక్కలాగా ఉంటుంది.తెలిసీ తెలియకుండానే అసూయ ఉండవచ్చు.అందువల్ల నుదుట బొట్టు ఉంటే కొంతవరకు నర దృష్టి కొట్టుకు పోతుంది.అంతేకాక రెండు కనుబొమల మధ్య కుంకుమ పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని లలాట భాగంలో  అంటే నుదుట బొట్టు పెట్టుకుంటే సరస్వతీ కటాక్షం కలుగుతుందని పెద్దల ఉవాచ.

No comments:

Post a Comment