Friday 4 November 2016

తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు

                                                         ఒకసారి శృతిలయ తాతయ్యతో కలిసి బంధువుల ఇంటికి వెళ్ళింది.ఆ ఇంట్లో ఒకచోట తాడు కట్టి ఆ తాడుకు అరటిపళ్ళు వేలాడతీసి ఉన్నాయి.ఆ అరటిపళ్ళ మీద పొగాకు రంగు,నల్లటి చుక్కలు ఉన్నాయి.శృతిలయ వాటిని చూడగానే  ఛీ!పాడైపోయిన అరటిపళ్ళు అలా తాడుకు  వేలాడేసుకున్నారేమిటి తాతయ్యా?అని  అడిగింది.అరటిపళ్ళు పాడైపోలేదు.పసుపుగా ఉన్నప్పుడు కన్నా నల్లటి చుక్కలు వచ్చినప్పుడు తింటే వాటిలో పోషకాలు రెట్టింపు ఉండి ఆరోగ్యం బాగుంటుందని,అదీకాక అన్నీ సమంగా పండుతాయని అలా వేలాడదీశారు.బాగా పండిన పండు తింటే త్వరగా జీర్ణమవటమే కాక మలబద్దకం లేకుండా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచి గుండె జబ్బుల బారిన పడకుండా చేస్తుంది.నల్లటి మచ్చలు వచ్చిన పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంతో కాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.రోజు ఒక అరటిపండు తింటే శరీరం కూడా నునుపుగా తయారై మెరుస్తూ ఉంటుంది.తాతయ్య చెప్పిన అరటిపండు కబుర్లు విని శృతిలయ నేను కూడా అలాగే తింటానని తాతయ్యకు మాట ఇచ్చింది. మనందరమూ కూడా పసుపు రంగులో ఉన్నప్పుడు మాత్రమే తిని ఏమాత్రం మచ్చలు వచ్చినా చెత్తలో పడేస్తూ ఉంటాము.ఇప్పటి నుండి మనం కూడా బాగా మగ్గి అక్కడక్కడా మచ్చలు వచ్చిన అరటిపళ్ళు చెత్తలో పడేయకుండా  తినడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.

No comments:

Post a Comment