Monday 19 December 2016

అధిక బరువు ఉంటే ఇవి తినాలి

                                                                                   అధిక బరువుతో బాధ పడేవాళ్ళు మూడు వంతులు ఆకుకూరలు,ఒక వంతు కూరగాయలు తింటే ఎక్కువ పోషక పదార్ధాలు ఉండి తక్కువ కేలరీలు ఉంటాయి.ఉదయం కాఫీ,టీ బదులు కూరగాయల రసం తీసుకుంటే మంచిది లేదా చిరు ధాన్యాలు దోరగా వేయించి మర పట్టించి అ పిండితో జావ తాగాలి.ఉదయం 8 గం.లకు 2,3 ఇడ్లీ తినాలి లేదా నూనె లేకుండా దోసె తినాలి.11 గంటలకు ఒక గుప్పెడు మొలకలు తినాలి.మధ్యాహ్న భోజనంలో పట్టు తక్కువ వేసిన బియ్యంతో వండిన అన్నం కొద్దిగా,ఒక పుల్కా,ఒక పెద్ద కప్పు కూర తక్కువ ఉప్పు కారంతో తినాలి.ఆకుకూరలో అయితే అసలు ఉప్పు వేయకపోయినా ఫర్వాలేదు,అంతగా తినలేకపోతే తక్కువ వేసుకోవాలి.4 గం.లకు సగం దానిమ్మ లేదా యాపిల్ తినాలి.చిన్న గ్లాసు రాగిజావ తాగొచ్చు.రాత్రిపూట భోజనం చేయకుండా ఒక కీరా,ఒక కప్పు అన్ని రకముల పండ్ల ముక్కలు,ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలి.రోజు మొత్తంలో అప్పుడప్పుడు గోరు వెచ్చటి నీళ్ళు తాగాలి.మంచినీళ్ళు కూడా ఎక్కువగా తాగాలి.ఈ విధంగా పాటిస్తే క్రమేపీ బరువు తగ్గుతారు. 

No comments:

Post a Comment