Saturday 3 December 2016

ఆకాశం నుండి కొరమీనులు

                                                                        సాయి కాంత్ స్వంత పొలంలో ఇల్లు కట్టుకుంటున్నాడు.చుట్టూరా పొలాలు,ఖాళీ స్థలాలే ఉన్నాయి.ఒక రోజు ఉన్నట్లుండి జోరున వర్షం పడింది.ఆ వర్షంతోపాటు ఆకాశం నుండి కొరమీనులు పొలాల్లో,ఖాళీ స్థలాల్లో ఉన్న నీళ్ళల్లో వచ్చి పడ్డాయి.విచిత్రం ఏమిటంటే వీళ్ళ పొలం ప్రక్కన తారు రోడ్డు ఉంది.మళ్ళీ ఆ తర్వాత పొలాలు ఉన్నాయి.చేపలు తారు రోడ్డు మీద పడలేదు.పొలాల్లో నీళ్ళల్లో మాత్రమే పడినాయి.ఇల్లు కట్టే పనివాళ్ళు నీళ్ళల్లో ఏవో ఎగురుతున్నాయి అని చూడటానికి వెళ్ళేసరికి చేపలు ఎగురుతున్నాయి.వాటిని పట్టుకుని ఒక గంపలో వేశారు.ఒక్కొక్కటి ముప్పావు కిలో నుండి ఒక కిలో వరకూ ఉన్నాయి.పనివాళ్ళు అందరూ తలా ఒక చేప సంతోషంగా ఇళ్ళకు పట్టుకుని వెళ్లారు.

No comments:

Post a Comment