Saturday 17 May 2014

వజ్రాయుధం

               2014 ఎన్నికలు ఒక నిశ్శబ్దసమరం.నోటితో మాట్లాడకుండా ఓటుఅనే వజ్రాయుధంతో వేటువేసి విజ్ఞతతో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు.ముందే ఊహించినా ఫలితాలువచ్చేవరకూ ఉత్కంటే.ఎవరికి ఎక్కడ పట్టం కట్టాలో
అక్కడ బ్రహ్మరథం పట్టారు.ఎప్పటిలా అదేమాపార్టీ అని ఒకదానికి పరిమితమవ్వకుండా ఆలోచించి ఎన్నిక చేశారు.
కొన్నిచోట్ల ప్రలోభాలకు లొంగిపోయినాఎక్కువమంది విచక్షణతో, సమర్థవంతంగా నాయకులను ఎన్నుకున్నారు.
అలాగే నాయకులు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఎన్నికల ముందు చెప్పినమాటలు
నిలబెట్టుకుని,అవినీతికి స్వస్తిపలికి,నీచరాజకీయలను అంతమొందించి,ప్రజోపయోగమైన పనులు చేపడుతూ సమర్ధతతో రాష్ట్రాలను,దేశాన్నిప్రతిభావంతంగా ముందుకు నడిపించాలని ఆశిద్దాం.   

No comments:

Post a Comment