Wednesday 28 May 2014

పిలవను-రాను

               అమృత,పీయూష్ విదేశీ భార్యాభర్తలు.ఇద్దరూ వైద్యులు.వాళ్లకు ఇద్దరు పిల్లలు.ఒక అమ్మాయి,ఒక అబ్బాయి.అబ్బాయి పెద్దవాడు.చక్కగా చెప్పినమాట వింటూ తనపని తను చేసుకుంటూ బాగా చదువుకుంటాడు. అమ్మాయి అల్లరిచేస్తూ అన్నింటికి అలుగుతుంటుంది.ఒకసారి అమృత కూతుర్నిలెక్కలు సరిగ్గా చేయలేదని కోప్పడింది.నువ్వు నన్ను కోప్పడటమేమిటి?నాన్న మంచివాడు నన్ను కోప్పడరు.పెద్దయిన తర్వాత నేను నిన్ను నాపెళ్ళికి పిలవను.నాన్నను పిలుస్తాను అని అమృతతో అంది.నువ్వు నాపెళ్ళికి వస్తావు కదూ అని నాన్నతో అంది.
పీయూష్ కూతురుతో నేను నాభార్య లేనిదే నీపెళ్ళికి ఒంటరిగా రాలేను అని చెప్పాడు.కూతురు మూతి ముడుచుకుని వెళ్ళిపోయింది.అమృతకు మాత్రం కూతురు అలా మాట్లాడటం విడ్డురంగా తోచింది.దీన్నిబట్టి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరూ సమానమేనని ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువకాదని అర్ధం చేసుకోవాలి.

No comments:

Post a Comment