Friday 9 May 2014

అతి సర్వత్ర వర్జయేత్

               రమణి చిన్నప్పటినుండి బొద్దుగా ఉండేది.పెళ్ళయి పిల్లలు పుట్టినతర్వాత ఇంకా బొద్దుగా తయారయింది.
పిల్లలు స్కూలుకి, భర్త ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత పనీపాటా లేక టి.వి.పెట్టుకుని చిప్స్ తింటూ,చల్లని పానీయాలు త్రాగుతూ నూటయాభై కిలోలు బరువు పెరిగింది.అసలే ఎత్తు తక్కువ.చూడటానికి గున్నేనుగు లాగా తయారైంది.అక్కా నేను గున్న ఏనుగులాగా ఉన్నానా?లేక పిప్పళ్ళబస్తా లాగా ఉన్నానా?అని తనమీద తనే జోకులేసుకునేది.తిండిమాత్రం తగ్గించేదికాదు.నడవటానికి కూడా ఇబ్బందిపడేది.కొలెస్టరాల్,రక్తపోటు రావటంవలన బరువుతగ్గాలని వైద్యులు సూచించారు.ఆకలికి తట్టుకోలేదు,తినకుండా ఉండలేదు కనుక ఇలాఅయితే ముందు ముందు ప్రాణానికే ప్రమాదమని వైద్యులు బేరియాటిక్ సర్జరీ చేయాలని చెప్పారు.రమణికి ఆసుపత్రికి వెళ్ళటం ఇష్టం ఉండదు.ఆపరేషన్ అంటే విపరీతమైన భయం.ఆధునిక తరహాలో ఆపరేషన్లు చేస్తున్నారు.ఇంటికి తొందరగావెళ్ళొచ్చు.నువ్వు అందరిలాగా మాములుగా తిరగొచ్చు.నీభయం ప్రాణంకన్నాఎక్కువ కాదుకదా!గుండెకు కూడా మంచిది కాదు బ్రతుక్కికూడా ప్రమాదం అన్నారు కనుక చేయక తప్పదు.ఏమీ భయంలేదు అని అందరూ నచ్చచెప్తే సరేనంది.అలా మూడుసార్లు ఆపరేషన్లు చేశారు.సర్జరీ చేయటంవల్లఎక్కువ తినలేదు.తిన్నావాంతులవుతాయి.అతిగా తినకపోతే ఈతిప్పలు వచ్చేవి కాదు కదా!అయినా రమణి తినగలిగినంత ఎప్పటికప్పుడు గంట గంటకీ తింటూ ఉండటం వలన ఏమాత్రం బరువు తగ్గలేదు.అన్నిసార్లు ఆపరేషన్ చేసినా ఉపయోగంలేదు.ముందే జాగ్రత్తగా బరువు పెరగకుండా ఉంటే ఈసమస్య వచ్చేదికాదు.అనారోగ్యం వచ్చిన తర్వాత భాధపడేకన్నా రాకముందే జాగ్రత్తపడాలి.అందుకే పెద్దలు "అతి సర్వత్ర వర్జయేత్"అన్నారు.













No comments:

Post a Comment