Thursday 8 May 2014

కోడలా కోడలా కొడుకు పెళ్ళామా

         రంజితాదేవిగారిది సాంప్రదాయ కుటుంబం.బోజనసమయంలోఇంటికి ఎవరువచ్చినా భోజనంపెట్టటం ఆనవాయితీ.టీ,కాఫీ,టిఫిన్ మామూలే.వ్యవసాయకుటుంబం కనుక పనివాళ్ళకు,వచ్చినవాళ్ళకు టీ ఇవ్వటం
సంగతి చెప్పనక్కరలేదు.వీరికి ఒక అమ్మాయి,ఒక అబ్బాయి.అమ్మాయి పెళ్లయింది పిల్లలు.వాళ్ళతో ఏసమస్య లేదు.అబ్బాయి పెళ్ళిచేస్తే కోడలు చేదోడువాదోడుగా ఉంటుందని, పద్దతులు తేడాఉన్నా మారుతుందని
డబ్బుదేముందిలే చదువుకున్నఅమ్మాయి అయితే బాగుంటుందని అనుకున్నారు.సరే ఈడుజోడు బాగానే
ఉందని పెళ్ళి చేసారు.అప్పటినుండి సమస్యలు మొదలయ్యాయి.ఇంటికి ఎవరన్నావచ్చినా పలకరించేదికాదు.
భువినుండి స్వర్గానికి వచ్చాననుకునేదో ఏమో ఏ.సి.గదిలోనుండి బయటకు వచ్చేదికాదు.మాఇంటికి ఎవరన్నా
వచ్చినా టీ,కాఫీ ఇవ్వము.పన్నెండున్నర్ర దాటితే భోజనంచేయమనము అనిచెప్పింది.అక్కడవేరు ఇక్కడవేరు
ఇక్కడి పద్ధతులకు నువ్వు అలవాటు పడాలి అంటే నేను మారలేనండీ అనేది.మా ఇంటికి ఎవరు వచ్చినామేము మాట్లాడము.వాళ్ళే వచ్చివెళ్ళిపోతారు అనేది.కోడలు చేదోడుగా ఉంటుందనుకుంటే కొడుకుతోపాటు కోడలికి
అత్తగారు వండి వార్చాల్సోచ్చింది.పెళ్ళయి ఇద్దరుబిడ్డల్ని కన్నా ఇప్పటికీ పూర్తిగా మారలేదు.ఆమె పద్దతికి ఎవరయినా మారాల్సిందే.ఇంకో విచిత్రమేమిటంటే కొడుకుల పెళ్ళిళ్ళయిన తర్వాత కూతుళ్ళు కన్నవారింటికి
రాకూడదు అనేది.తనపిల్లలను ఆడపిల్లలు లేకుండా ఒక్కడే కొడుకు ఉన్న ఇంటికి కోడళ్ళుగా పంపిస్తానని
చెపుతుంది.పాతిక సంవత్సరాలయినా ఇంటిభాద్యత పూర్తిగా తీసుకోదు.పెద్దవయసైనా రంజితదేవిగారికే
తప్పటంలేదు.     

No comments:

Post a Comment