Monday 26 May 2014

వసుధైకకుటుంబం

            పరంధామయ్యగారికి పదిమంది సంతానం.వారిలో ఆరుగురు కొడుకులు,నలుగురు కూతుళ్ళు.ఇంతకు
ముందురోజుల్లో ఎక్కువమందికి అధిక సంతానం ఉండేది.కూతుళ్ళ పెళ్ళిళ్ళయిన తర్వాత కొడుకుల పెళ్ళిళ్ళు
వరుసనేచేశారు.కొడుకులు,కోడళ్ళు,పరంధామయ్యగారు,ఆయనభార్య అందరూ ఒకేఇంటిలో కలిసిమెలిసి
ఐకమత్యంతో ఉండేవారు.ఇంటిపెద్దలు పరంధామయ్యగారు,ఆయనభార్య మాటలు ఇంట్లో అందరికీ వేదవాక్కు.
కోడళ్ళందరూ ఒక్కొక్క పనిచేస్తూ ఎవరిపనివాళ్ళు చేసుకుంటూ అందరూ సరదాగా,సంతోషంగా ఇంటిని
చక్కదిద్దేవారు.మనుమలు,మనుమరాళ్ళు పెద్దయ్యి,వాళ్ళచదువులు,పెళ్ళిళ్ళయ్యేవరకు కూడా కలిసే ఉన్నారు.
ఊరిలో అందరూ పరంధామయ్యగారి వసుధైకకుటుంబాన్నిచూచి ముచ్చటపడి కుటుంబమంటే అలాఉండాలని
అనుకునేవారు.ఇన్ని సంవత్సరాలు ఏపొరపొచ్చాలు లేకుండా చక్కగా ఉన్నారు.నాకూఓపిక తగ్గిందికనుక ఆస్తి
పంపకాలు చేస్తాను.మీకు ఇష్టమైతే కలిసి ఉండొచ్చు లేకపోతే ఎవరికివాళ్ళు వేరుగా ఉండండి అని కొడుకులకు పరంధామయ్యగారు చెప్పారు.తర్వాతికాలంలో కూడా కొంతమంది కలిసిఉన్నారు.అన్నిరోజులు కలిసి ఉండటం
అందరి గొప్పతనం.    

No comments:

Post a Comment