Monday 5 May 2014

రాళ్ళు,రప్పలు

    రాజేంద్ర,రవీంద్ర అన్నదమ్ములు.దైవదర్శనానికి వెళ్ళినా,ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులను,అక్కను తీసుకుని
కుటుంబసమేతంగా వెళ్ళేవాళ్ళు.పదహారు సంవత్సరాలక్రితం ఒకసారి షిర్డీవెళ్లారు.బాబాదర్శనం అయినతర్వాత నాసిక్,త్రయంబక్,శనిసింగణాపూర్,రాముడు,సీత అరణ్యవాసం చేసినప్పుడు నివసించినగుహ చూశారు.
అక్కడనుండి ఎల్లోరా,ఔరంగాబాద్ ,ఘ్రుష్నేస్వర్ వెళ్లారు.తిరిగి హైదరాబాదు వచ్చినతర్వాత యాదగిరిగుట్ట,బాసర వెళ్లారు.హైదరాబాదులో చూడవలసినవి తల్లిదండ్రులకు చూపెట్టారు.వీటన్నిటికి పదిరోజులు పట్టింది.ఇంటికి వచ్చిన తర్వాత భోజనాలుచేసి అందరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా మాటలసందర్భంలోజ్యోతిర్లింగాలకు అభిషేకాలతో సహా అన్నీచక్కగాచేశాము. అజంతా చాలాదూరం కనుక సమయంలేకపోవటంవలన వెళ్ళలేకపోయాము అనుకున్నారు.
  రాజేంద్ర,రవీంద్రల నాన్నగారు ఉన్నట్టుండి' చూపించారులే రాళ్ళు,రప్పలు'అన్నారు. అన్నదమ్ములిద్దరూ ఏమి మాట్లాడాలో తెలియక ఒకరి ముఖం ఒకరు  చూసుకున్నారు. కొడుకులు ఇద్దరూ ఉద్యోగాలకు సెలవు పెట్టిమరీ తీసుకెళ్ళి అన్నీ చూపిస్తే' భలే మాట్లాడారులే' అని తోడుకోడళ్ళు నవ్వుకున్నారు.



No comments:

Post a Comment