Saturday 10 October 2015

భోజనానికి వేళాయెరా

                                                               బాగా ఆకలి వేసిన తర్వాత ఏదో ఒకటి హడావిడిగా భోజనం చేయడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి.అజీర్ణం,త్రేన్పులువంటి సమస్యలు వస్తాయి.అలాగే వేళ కాని వేళ మధ్యాహ్నం రెండుగంటలు దాటిన తర్వాత తీరిగ్గా ఒక గంటసేపు తినడం వల్ల మగతగా నిద్ర వస్తున్నట్లు,హుషారుగా లేకుండా బద్దకంగా అనిపిస్తుంది.ఆలస్యంగా ఎక్కువసేపు తినడంవల్ల శక్తి లేనట్లు నీరసంగా ఉండటమే కాక,ఏకాగ్రత లోపించి కుదురుగా ఒకచోట కూర్చోలేనట్లుగా ఉంటుంది.ఏ పని చేయాలని అనిపించదు.మధ్యాహ్నం ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే సరైన సమయానికి భోజనం చేయాలి.భోజనానికి వేళాయెరా అన్నట్లు పగలు 12 గం.ల నుండి ఒంటి గంట లోపల భోజనం చేయాలి.రాత్రి 7.30నుండి 8 గం.ల మధ్యలో భోజనం చేయాలన్నమాట.ఒక అరగంట ముందే భోజనం చేసినా ఫరవాలేదు కానీ అరగంట ఆలస్యంగా భోజనంచేయకూడదు. ఒకేసారి ఎక్కువగా తినకూడదు.పొట్ట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.కొద్ది కొద్దిగా మధ్యమధ్యలో పండ్లు,కూరగాయలతో సలాడ్లు తినడంవల్ల బరువు పెరగకుండా ఉంటారు.ఆరోగ్యానికి కూడా మంచిది.ఎన్నిఒత్తిడి పనులన్నా వేళకు భోజనం చేయాలి.కనీసం నిద్రపోవటానికి మూడు గంటల ముందే తినడం మంచిది.భోజనం చేసిన తర్వాత ఇంట్లోనైనా కొద్ది సేపు నడవాలి.

No comments:

Post a Comment