Thursday 8 October 2015

ఇంట్లోనే మెరిసేలా.......

                                                                    ఒక రోజు సాకల్య స్నేహితురాలి పుట్టినరోజుకు వెళ్తూ అందరిలో తనే అందంగా కనిపించాలని దారిలో ఉన్న బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది.అప్పటికప్పుడు మెరవాలని సాకల్య బ్లీచ్ చెయ్యమంది.అసలే సుకుమారమైన చర్మం.అక్కడున్న ఆమె ముఖంపై ఏదో రాసి పది ని.ల తర్వాత తుడవగానే బుగ్గలు ఎర్రగా కందిపోయాయి.సాకల్యతోపాటు ఆమె కూడా కంగారు పడిపోయి ఐస్ తెచ్చి గబగబా రుద్దేసరికి కాసేపటికి తగ్గింది.సాకల్యకు కోపం వచ్చి గట్టిగా ఆమెపై అరిచేసరికి సారీ చెప్పి అలా అవుతుందని అనుకోలేదని సంజాయిషీ ఇచ్చింది.డబ్బు ఎదురు ఇచ్చి ఇబ్బందులు పడటం ఎందుకని అప్పటి నుండి సాకల్య ఇంట్లో దొరికే పదార్ధాలతోనే అమ్మ,అమ్మమ్మ సలహాలతో తనే స్వయంగా ఇంట్లోనే చేసుకోవటం మొదలుపెట్టింది.ఖాళీ సమయంలో వారానికొకసారి టొమాటో ముక్కని ముఖంపై మృదువుగా రుద్ది తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే ముఖం తేటగా,అందంగా మెరుస్తుందని సాకల్య అమ్మమ్మ చెప్పింది.ఒకస్పూను తేనె,ఒకస్పూను నిమ్మరసం తీసుకుని బాగా కలిపి ముఖానికి రాసి ఒక పది ని.ల తర్వాత కడిగేస్తే అప్పటికప్పుడు ముఖానికి మెరుపు వస్తుందని అమ్మ చెప్పింది.బియ్యప్పిండి,పాలు సరిపడా కలిపి ముఖానికి రాసి 10 ని.ల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగితే ముఖం మృదువుగా,అందంగా తయారవుతుంది.ఇలా సహజంగా ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటే చర్మంపై దద్దుర్లు రాకుండా ఉంటాయి.

2 comments:

  1. చాలా చక్కగా వివరించారు ఇందు గారు

    www.computerintelugu.com

    ReplyDelete