Wednesday 7 October 2015

వీలైనంతవరకూ.......

                                                            మనలో చాలామంది ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చోవటం లేదా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం చేస్తుంటారు.దీనివల్ల కాళ్ళపై ఒత్తిడి పెరుగటమే కాక  ఆ విధంగా కూర్చోవటం వల్ల కాళ్ళల్లో రక్తప్రసరణ తగ్గి ముందుముందు కాళ్ళల్లో రక్తం గడ్డకట్టడం లేదా పాదాలు వాపు రావడం లాంటి సమస్యలు వస్తుంటాయి.అలా రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు కాళ్ళను సాగదీస్తుండాలి.వీలైనంతవరకు పాదాలను నేలకు ఆనించి నిటారుగా కూర్చోవాలి.నడుము నొప్పి కూడా రాకుండా ఉంటుంది.రోజూ ఒక ఇరవై నిమిషాలన్నా నడక మంచిది.దీనివల్ల కాళ్ళ కండరాలు,మడమలు ఆరోగ్యంగా ఉంటాయి.

No comments:

Post a Comment