Monday 26 October 2015

మెరుగైన నిర్ణయాలు

                                                           తెల్లవారుఝామున ఏకాగ్రతతో చదవడంవల్ల త్వరగా చదివినది బుర్రకెక్కి గుర్తుండిపోతుంది.అందుకే పెద్దవాళ్ళు తెల్లవారుఝామున చదుకున్న చదువే చదువు అని చెప్పేవాళ్ళు.ఉదయానే
ఏ ఆహారం తీసుకోకముందు శరీరం,మనసు దేన్నైనా చురుగ్గా స్వీకరించి చక్కటి ఫలితాలిస్తాయి.పరగడుపున చేసిన వ్యాయామం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.తెల్లవారుఝామున అదీ పరగడుపున ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల కిష్టమైన సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది.ఆ సమయంలో ఆలోచించడంవల్ల మెరుగైన నిర్ణయాలు తీసుకో గలుగుతారు.వ్యాపార దిగ్గజాలందరూ సూర్యోదయానికి ముందే తమ దినచర్యను మొదలెట్టటంవల్ల వ్యాపారంలో రాణించ గలుగుతున్నారు.పరగడుపున పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండి జీవక్రియ మెరుగ్గా ఉంటుంది.అందుకే ఏ పని చేసినా మెరుగైన ఫలితాలుంటాయి.

No comments:

Post a Comment