Thursday 21 November 2013

శివాలయం

                 అమ్మమ్మ వాళ్ళ వీధి చివర ఒక పెద్ద శివాలయం ఉండేది .వినాయకుడు ,శివుడు ,పార్వతీదేవి
     విగ్రహములు ఉండేవి .ఒక ప్రక్కన నాగేంద్రుని పుట్ట ఉండేవి.పుట్టలో పాలు పోసి ఆడపిల్లలకు చెవులకు
      పోగులు   కుట్టిచ్చేవారు .

                  ఇప్పుడు ఆంజనేయస్వామి ,నాగేంద్రస్వామి నవగ్రహ మండపము కట్టారు .చాలా ప్రశాంతముగా
     ఉంటుంది .అక్కడ పూజారి గారు కూడా చాలా బాగా   పూజ చేస్తారు .పూజారి గారి భార్య కూడా చాలా
     బాగా వండి నివేదనలు పెట్టడానికి ఇచ్చేవారు.మా ఇంటి ప్రక్కనే ఉండేవారు.
                   నవరాత్రులప్పుడు ఏ రోజు ఏ నివేదన పెట్టాలో వాళ్ళు చెప్పేవారు.ఎవరు ఏ రోజు చేయించుకోవాలి
      అనుకుంటే ఆ రోజు అన్నీ పంపిస్తే బాగా చేసేవారు.అమ్మవారికి చీర జాకెట్టు ముక్క ఇస్తే చక్కగా కట్టి
    అలంకరించేవారు .మేము వెళ్ళి అక్కడ కూర్చుని పూజ చే పించుకునేవారము.
               
                   ఇంతకీ ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే  రాత్రిపూట నాగేంద్రస్వామి శివలింగానికి చుట్టుకుని ఉండటం.
దేవతా  సర్పమని మంచి సువాసన వస్తూ ఉండేదని పూజరిగారికి కనిపించేదని చెప్పేవారు .అందుకనే రాత్రి
గుడికి  వెళ్ళాలంటే గంట మ్రోగించి మరీ లోపలకు వెళ్ళేవారు.

           ఎవరయినా ఈ గుడికి వెళ్ళి ఏదయినా మొక్కుకుంటే ఆ పని తప్పకుండా పూర్తి అవుతుంది.ఇది మా
అందరి నమ్మకము .నిజము .ఈ గుడి విజయవాడకు 10-12 కి .మీ దూరంలోఉంటుంది.

   

No comments:

Post a Comment