Tuesday 19 November 2013

ఒక్క క్షణం ఆలోచిస్తే.....

                    వార్తాపత్రికలో ఒక వార్త చదివాను.నాకు చాలా భాధ కలిగింది.అందుకే ఇలా మీ అందరితో
పంచుకోవాలనిపించింది.అది ఏమిటంటే ఒక వైధ్య విద్యార్ధి ఆత్మహత్య చేసుకోన్నాడనే వార్త.విద్య పూర్తి
చేసుకొని ఎంతోమందికి ప్రాణ భిక్ష పెట్టవలసినవాడు అలా ప్రాణం తీసుకోవటం చాలా భాదాకరంగాఉంది .

                   కారణంఏదయినా కానివ్వండి అలా చేయాల్సింది కాదు.ఎన్నో ఆశలతో కొడుకు డాక్టరు
అయితే బాగుంటుందని తల్లిదండ్రులు అనుకోని ఉంటారు .ఏదయినా సమస్య వుంటే తల్లిదండ్రులతో
కానీ స్నేహితులతో కానీ పంచుకోవాల్సింది.
                                
               పేపరులో ఫోటో వేసారు .చక్కగా ఉన్నాడు.తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే వాళ్లకు
ఒక్కడే పిల్లవాడనిచెప్పారు.నేను ఇలా చేస్తే తల్లిదండ్రులు ఎంత భాద పడతారు ఇలా చేయడం
ఎంతవరకు సమంజసం అని చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే బావుండేది.ఇలా జరిగివుండేది
కాదు .విన్న నాకే ఇంత భాధగా వుంటే తల్లిదండ్రులకు ఎంత భాధగా వుండి ఉంటుంది .

          ఏదయినా సమస్య వస్తే చిన్నప్పటినుండే అన్నికోణముల నుండి ఆలోచించి  సరిఅయిన నిర్ణయం
తీ సుకోగ లిగేటట్లు ధయిర్యంగా సమస్యను   ఎదుర్కోగలిగే టట్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శిక్షణ
ఇవ్వాలి.
            ఇంతకు ముందు రోజులలో తాతయ్యలు ,అమ్మమ్మలు ,నానమ్మలు ,మేనమామలు,అత్తలు
వాళ్ళ పిల్లలు అందరూ కలసి మెలసి ఉండడం వలన చిన్న చిన్న వాటికి సర్దుబాటు తత్వం అలవడేది.
           
        సూచన:తల్లిదండ్రులుగా మనమందరమూ, ఉపాధ్యాయులుగా కోప్పడకుండా భాధ్యతగా
పిల్లలను ,విధ్యార్ధులను   తీర్చిదిద్దుదామనినా సూచన.  

No comments:

Post a Comment