Tuesday 26 November 2013

నారదమ్మ

       శ్యామల వాళ్ళ బంధువులలో ఒక పెద్దావిడ ఉండేది.ఆవిడ ఉన్నవి లేనివి ఒకళ్ళమీద ఒకళ్ళకి చెప్తుండేది.
ఆవిడకు ఆరుగురు పిల్లలు.అందుకని ఎప్పుడూవాళ్ళ కోసం పిండివంటలు చేసేది.వాళ్ళు ఎప్పుడూఏదో ఒకటి
పెట్టమని అడిగేవాళ్ళు.పిండివంటలు వండటం అంటే ఇద్ధరోముగ్గురో ఉండాలికదా.
          అలా వాళ్ళతో చాకిరి చేయించుకుంటూ వాళ్లకాలక్షేపం కోసం ఎవరో ఒకరి గురించి చెప్తుండేది.ఒకసారి ఆ
సమయంలో శ్యామల వెళ్ళింది.సరిగ్గా ఆ సమయంలో శ్యామల వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుతుంది.
శ్యామల చిన్నపిల్లే అయినా కానీ ఇంటికివచ్చి అన్నీ ఇంట్లో చెప్పేసింది.అలా రెండుమూడు సార్లు జరిగింది.
ఈ విషయం పెద్దావిడకు అర్థమయింది.ఇక అప్పటినుండి శ్యామల వచ్చిందంటే భయం.చెప్పేదికూడా ఆపేస్తుంది.
ఎక్కడ ఇంటికి వెళ్లి చేప్తుందోనని.ముసలితనం వచ్చింది అయినా ఆవిడమాత్రం మారలేదు.అందుకని తనను  "నారదమ్మ"అంటారు. అంటే తగువులు పెడుతుందని శ్యామల ఆ పేరు పెట్టింది.
          నారదుడు లోకకల్యాణం కోసం తగువులు పెడితే ఈవిడ కాలక్షేపం కోసం లేనిపోయినవి సృష్టిస్తుంది.
అందుకని నారదమ్మ అయింది. 

No comments:

Post a Comment