Tuesday 26 November 2013

కోటి దీపోత్సవం

         శ్రేష్ట వాళ్ళఊరిలో  ఒక శివాలయం ఉంది.ఆ శివాలయంలో 28సంవత్సరాల క్రితమే లక్ష దీపాలు వెలిగించారు.
అప్పటినుండి దాదాపుగా ప్రతిసంవత్సరము లక్షదీపోత్సవం చేస్తారు.ఆ ఊరివాళ్ళు కానీ ప్రక్కఊరివాళ్ళుకానీ ఎవరో
ఒకళ్ళు కార్తీకమాసంలో వెలిగిస్తారు.ఈసారి కోటి దీపాలు వెలిగించారు.
        అంతకుముందు365వత్తులు ఒక్కొక్కదానిలో వేసి వెలిగించేవారు.ఇప్పుడు పెద్దప్రమిదలలోలక్ష చొప్పున
వెలిగిస్తున్నారు.ఊరిలో ఒకతనికి బొమ్మలువేయటం వచ్చు.అతను గుడిలో బయట ధ్వజస్తంభం ప్రక్కన గుడిచుట్టు ప్రక్కల శివలింగం,ఓంకారము రకరకాల బొమ్మలు వేశాడు.ఆ ఆకారాలలో దీపాలు వెలిగించారు.చూడటానికి కన్నులపండుగగా ఉంది. 

No comments:

Post a Comment