Monday 1 June 2015

కొలిమిలో పడ్డట్లు ........

                                                   రామతులశమ్మ గారికి అరవై  తొమ్మిదేళ్ళు.మనుమరాలు,మనవడు,తమ్ముడి కుటుంబాన్ని చూద్దామని విదేశాల్లో ఉన్న తమ్ముడింటికి వెళ్లారు.అక్కడ ఉన్నన్ని రోజులు అందరికంటే ఎంతో ఉత్సాహంగా నాలుగు రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూచి వచ్చారు.స్వదేశానికి వచ్చేటప్పుడు అబుదాబీలో మిట్టమధ్యాహ్నం విమానం దిగారు.చల్లటి ప్రదేశం నుండి వచ్చి దిగీదిగగానే భానుడి ప్రతాపానికి తట్టుకోలేక ఒక్కసారిగా కొలిమిలో పడ్డట్లు అనుభూతి కలిగి విలవిలలాడారు.స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత విపరీతమైన ఎండలవలన వారం రోజులు మూసినకన్ను తెరవకుండా మంచానికి అతుక్కుపోయి సమయానికి కొంచెం తినడానికి,తాగటానికి లేవటం తప్ప చల్లదనంలో నుండి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది.నా జీవితకాలంలో ఎండ దెబ్బ అంటే ఏమిటో ఇప్పుడే అనుభవమైంది అని చెప్పారు. 

No comments:

Post a Comment