Tuesday 9 June 2015

సముద్రంలో చాలా నీరు

                                               హరిశ్చంద్ర ప్రసాద్ గారి మనుమడు చాలా తెలివికలవాడు.ఐదేళ్లుంటాయి.ఒకసారి మంచినీళ్ళు కొంచెం తాగి మిగతావి క్రింద పారబోస్తున్నాడు.మంచినీళ్ళు వృధాగా క్రింద పోయకూడదు.కొన్నాళ్ళకు మనకు తాగటానికి మంచి నీళ్ళు దొరకవు అని చెప్పారు.అదేమిటి?సముద్రంలో చాలా నీళ్ళున్నాయి కదా!అన్నాడు.
సముద్రంలో నీళ్ళు ఉప్పగా ఉండి తాగటానికి ఉపయోగపడవు.అందువల్ల తాగలేము అని చెప్పారు.కనుక మనం మంచినీళ్ళను వృధా చేయకూడదు అని చెప్పగానే సరే ఇంకెప్పుడు పారబోయనులే అని చెప్పాడు.ఎక్కువగా చెప్పినా చిన్ని బుర్రకు అర్ధం కాదు కదా!    

No comments:

Post a Comment