Friday 19 June 2015

చిరుధాన్యాల దోశ(మల్టీ మిల్లెట్ దోశ)

రాగులు - 1 కప్పు
సజ్జలు - 1 కప్పు
తెల్ల జొన్నలు - 1 కప్పు
కొర్రలు - 1 కప్పు
 మినప్పప్పు - 1 కప్పు
ముడి బియ్యం - 2 కప్పులు
మెంతులు - 1 1/2 స్పూను
ఉప్పు - తగినంత
                                               అన్నీ విడివిడిగా కడిగి 5 లేక 6 గం.లు నానబెట్టుకోవాలి.మినప్పప్పు,మెంతులు బియ్యం కలిపి మిక్సీలో కానీ గ్రైండర్ లో కానీ వెయ్యొచ్చు.మిగతా చిరుధాన్యాలన్నీ కలిపి రుబ్బుకోవచ్చు.మినప్పిండిలో మిగతా పిండి,ఉప్పు కూడా కలిపి 8 గం.లు బయట ఉంచితే పిండి పొంగుతుంది.తర్వాత దోశ వేసుకుంటే రుచికి రుచి,ఆరోగ్యానికి ఆరోగ్యం.ఏ చట్నీతోనయినా రుచిగా ఉంటుంది.పిండి మాములు దోశ పిండి లాగానే ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. 

No comments:

Post a Comment