Monday 7 December 2015

ప్రతిరోజూ ఆవిరి

                                                                         సాధారణంగా మనకు జలుబు చేసినప్పుడు మాత్రమే ఆవిరి పట్టాలని గుర్తొస్తుంది.కానీ ప్రతిరోజూ ముఖానికి ఆవిరి పడితే ముఖం అందంగా,తాజాగా ఉంటుంది.చలికాలంలో ముఖం పొడిబారినట్లు ఉంటుంది కనుక మరిగే నీళ్ళల్లో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి ఆవిరి పడితే చర్మానికి తేమ అంది చర్మం శుభ్ర పడుతుంది.నీళ్ళను మరిగించి గుప్పెడు పుదీనా ఆకుల్ని వేసి ఆవిరి పడితే శరీరానికి కొత్త శక్తి వస్తుంది.జలుబుగా ఉంటే మరిగే నీళ్ళల్లో యూకలిప్టస్ నూనె వేసి ఆవిరి పడితే తొందరగా ఉపశమనం కలిగి  శ్వాస తీసుకోగలుగుతారు.                

No comments:

Post a Comment