Monday 7 December 2015

నీళ్ళల్లో ఈదుకుంటూ.......

                                               ఇరవై రోజుల క్రితం చెన్నైలో వర్షాలు మొదలైనప్పుడు మనస్విని పెళ్ళి.అప్పటికే జోరున వర్షం.కళ్యాణ మండపం చుట్టూ నీళ్ళు.పెళ్ళికొడుకు,బంధువులు రావాలన్నానీళ్ళల్లో నుండి రావాల్సిందే.అది అల్లాటప్పా పెళ్ళి కూడా కాదు.ఐ ఏ ఎస్ అధికారి కూతురి పెళ్ళి.అయినా ఇబ్బంది తప్పలేదు.విధికి ఎవరైనా తలవంచవలసిందే కదా!ముహూర్తం సమయం దగ్గర పడుతుంది.పెళ్ళికొడుకు ఇంకాకళ్యాణ మండపానికి చేరుకోలేదని అందరిలో ఉత్కంఠ.ఇంతలో ఎవరరూ ఊహించని విధంగా పెళ్ళికొడుకు నీళ్ళల్లో ఈదుకుంటూ సగం తడిసిన బట్టలతో వచ్చాడు.పెళ్ళికొడుకు కూడా మామూలు వ్యక్తి కాదు.ఐ పి ఎస్ అధికారి.ముహూర్తం సమయానికి సాహసం చేసి మరీ వచ్చినందుకు పెద్దలందరూ ఎదురెళ్ళి అభినందించి తోడ్కొని రాగా ముహూర్త సమయానికి మనస్విని మెడలో తాళి కట్టాడు..పెళ్ళికూతురు కూడా వైద్యురాలు.తుఫానులో పెళ్ళి ఎలా జరిగింది?అని స్నేహితురాలు ఫోను చేస్తే విచిత్రంగా జరిగింది అని చెప్పి పెళ్ళికొడుకు గుర్రం మీద రావటం చూశాం కానీ వింతగా నీళ్ళల్లో ఈదుకుంటూ వచ్చి మరీ నన్ను పెళ్ళి చేసుకున్నాడని మనస్విని చెప్పింది.

No comments:

Post a Comment