Thursday 3 December 2015

అన్నదాతా సుఖీభవ!

                                                               సీతమ్మ,లక్ష్మమ్మ మంచి స్నేహితురాళ్ళు.అరవై సంవత్సరాలుంటాయి. నాగులచవితి సందర్భంగా పుట్టలో పాలు పొయ్యాలని అనుకున్నారు.వాళ్ళ ఊరిలో అయితే చాలా ఒత్తిడిగా ఉంటుందని ప్రశాంతంగా,నిదానంగా పూజ చేసుకోవచ్చని ఒక 1/2 గంట ప్రయాణించి వేరే ఊరులో ఉన్న సాయిబాబా  గుడికి వెళ్ళారు.అక్కడ కూడా చాలామంది ఉండటంతో అందరూ వెళ్ళేవరకు ఎదురు చూశారు.అప్పటికే 12 గం.లు అయ్యేసరికి నీరసం వచ్చింది.భక్తితో ఎలాగయినా పుట్టలో పాలుపొయ్యాలనుకుని ప్రయత్నించేసరికి తూలు వచ్చి పడిపోబోయేసరికి పక్కనే ఉన్న యువకుడు పట్టుకుని దగ్గరుండి వాళ్ళిద్దరికీ పుట్టలో పాలు పొయ్యటానికి సహాయం చేశాడు.బాబూ!నువ్వెవరివో? కానీ సమయానికి దేవుడే పంపినట్లుగా వచ్చి సహాయం చేశావు చల్లగా ఉండాలి అని దీవించారు. అదేరోజు ఇందుమతి కుటుంబం బాబా గుడిలో పూజ,సత్యన్నారాయణ స్వామి వ్రతం చేసుకుని బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు.ఉదయం నుండి పుట్టలో పాలు పొయ్యటానికి వీలుపడక పుట్ట దగ్గరికి వచ్చిన ఇందుమతికి విషయం తెలిసి సీతమ్మను,లక్ష్మమ్మను విందుకు ఆహ్వానించింది.ఇద్దరూ డబ్బున్న వాళ్ళే.అప్పటికప్పుడు పిలిస్తే భోజనానికి రావటానికి మొదట ఇష్టపడలేదు.ఇందుమతి పట్టుబట్టి మీరు వయసులో పెద్దవాళ్ళు.ఈసమయంలో భోజనం చేసి వెళితే మాకు సంతోషం అని దగ్గరుండి భోజనానికి తీసుకెళ్ళింది.అన్నదాతా సుఖీభవ!అంటూ ఇద్దరూ నిష్కల్మషంగా దీవించేసరికి ఇందుమతి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది.బంధుమిత్రులు అందరూ వచ్చినా స్నేహితురాళ్ళు ఇద్దరూ భోజనం చేయడం ఇందుమతికి ఎంతో తృప్తిగా అనిపించింది.

No comments:

Post a Comment