Thursday 27 February 2014

హైటెక్ దోపిడి

        అరుంధతి అక్క మనుమరాలి పెళ్లి కుదిరింది.పెళ్ళికొడుకు లండన్లో ఉంటాడు.తల్లిదండ్రులు భారతదేశంలో
ఉంటారు.పెళ్లిబట్టలు కొనటానికి వెళ్ళినప్పుడు పెళ్లి కూతురి చీర తక్కువలోతీసుకుంది.ఆడపెళ్ళి వాళ్ళతో
పెళ్లికొడుకుతల్లి ఎక్కువరేటులో కొనిపించుకుంది.ఆమె చెల్లి మాఅక్కతక్కువరేటు చీరలు కట్టదు అంది.
అందరికన్నా మంచిచీర పెళ్లికూతురికి పెట్టాలికదా ఆ ఆలోచనలేదు.సరే మంచిసంబంధం కదా పిల్లడు
మంచివాడు చిన్నచిన్నవి పట్టించుకోవటం ఎందుకులే అని వదిలేశారు.లగ్నాలు పెట్టుకున్నతర్వాత
అయిదు లక్షలు ఆడపడుచుకట్నం ఇమ్మని కబురు చేశారు.మేనత్త,మేనమామ పిల్లలయినా పెళ్లికూతురి
తల్లిదండ్రులు కలిసిఉండరు.ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలబాధ్యత పంచుకున్నావీళ్ళు వేరుగా
ఉంటున్నారు.పిల్లపెళ్ళికి ముందే ఇలామగపెళ్లివాళ్ళు మాట్లాడుతున్నారేమిటి? ముందుముందు ఎలా
ఉంటుందో?అని అందరూ కంగారుపడ్డారు.మీరు కంగారుపడాల్సిన అవసరంలేదు మీ అమ్మాయిని
జాగ్రత్తగా నేను చూసుకుంటాను.ఆడబ్బు వాళ్ళసంతృప్తి కోసం ఇవ్వండి నేను మీకు ఇస్తాను  అని పిల్లడు చెప్పినతర్వాత కుదుటపడి ఆడపడుచు కట్నం సమర్పించుకున్నారు.ఇదొక హైటెక్ దోపిడి అని అందరూ
అనుకొన్నారు.అరుంధతి ఇది జన్మలో మర్చిపోలేని సంఘటన అనుకుంది.

No comments:

Post a Comment