Tuesday 25 February 2014

మనిషి ముందు మనిషి మాట

       రుక్మిణి బంధువులలో నాగిణి మనిషి ముందు మనిషి మాట చెప్తుండేది.మనముందు మనమే మంచి
వాళ్ళమని వేరేవాళ్ళు చెడ్డవాళ్ళని వేరే బంధువుల ఇంటికి వెళ్లి మీరు చాలామంచివాళ్ళు వాళ్ళకన్నా అని
చెప్పేది.ఆరకంగా చెప్పి వారంరోజులు తిష్ట వేసి ఎక్కడికక్కడ తింటూ పబ్బం గడుపుకోనేది.ఇక్కడ తినేసి
ఆమెకు చేతులు పనిచెయ్యవు,ఈమెకు నడుము పనిచెయ్యదు, పనులు చెయ్యలేరు అని ఇంకొకచోట చెప్పేది.తిన్నన్నిరోజులు తిని ఇకలాభం లేదు అనుకొన్నప్పుడు వేరేఊరు మకాం మార్చేది.ఒకసారి
బంధువుల ఇంట్లో పెళ్ళిలో అందరూమాట్లాడుకునేటప్పుడు నాగిణి అందరి ఇళ్ళల్లో పదేసిరోజులు ఉండి ఇలా చెప్తుంది అనితెలిసిఅందరూ కలిసి నోట్లో గడ్డి పెట్టారు.ఇంకెప్పుడూ అలాచెప్పను అని చెంపలు వేసుకుని  అప్పటినుండి అలా ప్రవర్తించటం మానేసింది.
  

No comments:

Post a Comment