Thursday 27 February 2014

జాతర

      యశోధర ఖమ్మం దగ్గర పల్లెటూరిలో ఉంటుంది.వాళ్ళఊరి దగ్గర శివరాత్రికి పెద్దజాతర జరుగుతుంటుంది.
ఆచుట్టుప్రక్కల వాళ్ళు జాతరకు వచ్చేవాళ్లకోసం ఎవరికి తోచిందివాళ్ళు పంపిస్తుంటారు.ఈసారి యశోధరవాళ్ళు
పొలంలో పండినధాన్యము,కూరగాయలు ముందుగా స్వామికి ఇద్దామని అనుకొన్నారు.అందుకని 3క్వింటాళ్ళ
బియ్యం,పప్పులు,కూరగాయలతో వంటలు చేయించి గుడిదగ్గరకు పంపించారు.అక్కడివాళ్లు నివేదనపెట్టి జాతరకు వచ్చినవాళ్ళకు భోజనాలు పెడతారు.ఈజాతర కన్నులపండుగగా జరుగుతుంది.ఇది చూచి తరించటానికి   చుట్టుప్రక్కలవాళ్ళే కాక ,దూరప్రాంతాలనుండి కూడా చాలామంది వస్తుంటారు.క్రిందటి సంవత్సరం యశోధర వాళ్ళు ఇలాగే వంటలు చేయించి కోటిపల్లికి పంపించారు.
                                                                   

No comments:

Post a Comment