Tuesday 2 September 2014

మైదాతో చిట్టి చెక్కలు

 మైదా  - 1/2 కే.జి
 పచ్చి శనగపప్పు - గుప్పెడు
 పచ్చి మిర్చి- 6
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - తగినంత
నూనె - వేయించటానికి సరిపడా
                     పచ్చి శనగపప్పు నానబెట్టాలి.అల్లం,పచ్చి మిర్చి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.కుక్కర్ లో అడుగున నీళ్ళు పోసి పైన ఒక పలుచటి వస్త్రం వేసి దానిలో మైదా వేయాలి.విజిల్ లేకుండా మూతపెట్టి ఆవిరిపై ఉడికించాలి.15 ని.ల
తర్వాత దించేయాలి.అప్పుడు మైదాలోనానబెట్టిన పచ్చి శనగపప్పు,అల్లం,పచ్చి మిర్చి పేస్ట్,ఉప్పువేసి గట్టిగా కలపాలి.బాండీలో నూనె పోసి కాగిన తర్వాత ఒక పాలిథిన్ కవరుకు నూనె రాసి దానిపై చిన్నచిన్న చెక్కలు చేసుకోవాలి.వాటిని నూనెలో వేసి వేగనివ్వాలి.తెల్లగా ఉండగానే తీస్తే తర్వాత గోధుమ రంగులోకి వస్తాయి. అంతే కరకరలాడే చిట్టి చిట్టి చెక్కలు రెడీ.
ఇష్టమైతే కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు.

No comments:

Post a Comment