Friday 5 September 2014

జంతికలు(చక్రాలు)

           బియ్యం - 4 కప్పులు
           మినపగుళ్ళు  - 3/4 కప్పు
           పచ్చిశనగపప్పు - 1/4 కప్పు
          సగ్గు బియ్యం - చారెడు (నాలుగు వేళ్ళమీద నిలిచినన్ని)
           నూనె - వేయించటానికి సరిపడా                                                                                                                                                 బియ్యం కడిగి ఎండలో ఒక క్లాత్ మీద ఆరబెట్టాలి. మినపగుళ్ళు దోరగా వేయించుకోవాలి.
 ఎండినబియ్యం,మినపగుళ్ళు(లేక) పప్పు,పచ్చిశనగపప్పుసగ్గుబియ్యం అన్నీకలిపి మరపట్టించాలి.పిండి మొత్తంలో కొంచెం వాము,ఉప్పు,కారం కలిపి సరిచూచుకుని కొంచెం కొంచెం పిండి,వెన్న,కొద్దిగా గోరువెచ్చనినీళ్ళతో జంతికల గొట్టంలో నుండి దిగేలా కలుపుకోవాలి.ఎక్కువ పిండి కలిపితే సమయం గడిచిన కొద్దీ చక్రాలు గట్టిగా వస్తాయి.వీటిని కాగిన నూనెలో గుండ్రంగా చుట్టలు నొక్కి వేయగలిగితే వేయవచ్చులేదా ఒక ప్లేటుకి నూనె రాసి దానిమీద గుండ్రంగా వత్తి నూనెలో వేయవచ్చు.బంగారు వర్ణంలో వేయించాలి.అంతే నోరూరించే జంతికలు(చక్రాలు,చక్కిలాలు)రెడీ.   

No comments:

Post a Comment