Thursday 4 September 2014

బియ్యప్పిండి-సగ్గుబియ్యం వడియాలు

                    బియ్యప్పిండి  - 1 కప్పు
                    సగ్గుబియ్యం   -  1/2 కప్పు
                    నీళ్ళు   -  6 కప్పులు
                    పచ్చి మిర్చి - 8
                    ఉప్పు - రుచికి సరిపడా
                                                       సగ్గుబియ్యం రాత్రిపూట ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టాలి.బియ్యప్పిండి ఒక కప్పు నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి.స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో నాలుగు కప్పుల నీళ్ళు మరిగించి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికిన తర్వాత నీళ్ళల్లో కలిపిన బియ్యప్పిండి పోసి బాగా త్రిప్పాలి.చివరలో పచ్చిమిర్చి,ఉప్పు
పేస్ట్ వేసి కలిపి చిక్కబడిన తర్వాత దించేయాలి.బాగా ఆరబెట్టి మధ్యమధ్యలో తెట్ట కట్టకుండా త్రిప్పుతుండాలి.
ఆరిన తర్వాత పాలిథిన్ కవరు మీద ముద్దలుగా చేతితో పెట్టాలి.ఎండలో ఎండబెడితే సాయంత్రానికి ఎండిపోయి రాలిపోతాయి. బాగా ఎండిన వాటిని డబ్బాలో పోస్తే సంవత్సరం నిల్వ ఉంటాయి.

No comments:

Post a Comment