Tuesday 23 September 2014

మైసూరు బోండా

మైదా - 3 కప్పులు
బియ్యప్పిండి - కప్పు
పెరుగు - 2 కప్పులు (బాగా గిలకొట్టాలి)
జీరా - టీ స్పూను
ఉప్పు - తగినంత
వంటసోడా - 1/4 టీ స్పూను
నీళ్ళు - తగినన్ని
నూనె - వేయించటానికి సరిపడా
                                                         మైదాలో బియ్యప్పిండి,వంటసోడా,జీరా,ఉప్పుకలిపి పెరుగు,తగినన్ని నీళ్ళుపోసి గట్టిగా కాకుండా మధ్యరకంగా మెత్తగా కలిపి ఉంచాలి.చిన్నసైజు నిమ్మకాయంత పిండి తీసుకుని అరచేతిలో గుండ్రంగా చేస్తూ నూనెలోవేసి బంగారువర్ణంలోవేగనిచ్చి తీయాలి.వేడివేడిగా కొబ్బరి పచ్చడితో తింటే రుచిగా ఉంటాయి.ఇష్టమైన వాళ్ళు అల్లం పచ్చడితో కూడా తినవచ్చు.  

No comments:

Post a Comment