Tuesday 23 September 2014

పునుగులు

బియ్యం -1/2 కిలో
మినప్పప్పు - 1/4 కిలో
పచ్చి శనగపప్పు - 100 గ్రా.
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)
పచ్చి మిర్చి - పది
అల్లం - చిన్న ముక్క
జీరా -టీ స్పూను
 ఉప్పు - తగినంత
వంటసోడా - 1/4 టీ స్పూను
నూనె - వేయించటానికి సరిపడా
                                                    మినప్పప్పు,బియ్యం నాలుగు గం.లు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి.పచ్చి శనగపప్పును ఒకగంట ముందుగా నానబెట్టాలి.ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం సన్నగా తరగాలి.రుబ్బిన పిండిలో శనగపప్పు,ఉల్లి,అల్లం,పచ్చి మిర్చిముక్కలు,జీరా,ఉప్పు,వంటసోడా వేసి మధ్యస్థంగామెత్తగా కలపాలి.మీడియం      సైజులో పిండిముద్దను తీసుకుని గుండ్రంగా చేసి నూనెలో వేసి బాగా వేయించాలి.వీటిని వేడివేడిగా వేరుశనగ లేదా
కొబ్బరి పచ్చడితో తింటే బాగుంటాయి.

No comments:

Post a Comment