Tuesday 2 September 2014

బియ్యం రవ్వతో ఉండ్రాళ్ళు

                       గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక నివేదన పెడుతుంటాము.బియ్యం రవ్వతో ఉప్పు వేసి చేసే ఉండ్రాళ్ళు ఎంతో ప్రత్యేకమైనవి.అవి ఎలా చేయాలంటే ......
                    కటుకు బియ్యం రవ్వ- 1 కప్పు
                    నీళ్ళు - 1 1/4 కప్పు
                    నెయ్యి - కొంచెం
                    ఉప్పు - తగినంత
                    జీరా  - 2 స్పూనులు
                                 కటుకు బియ్యం రవ్వ (బియ్యం కడిగి ఆరబెట్టకుండా డైరెక్ట్ గా రవ్వ పట్టించాలి) పట్టించి
మందపాటి గిన్నెలో నెయ్యి వేసి,నీళ్ళు పోసి తెర్లుతుండగా(బాగా మరుగుతుండగా)ఉప్పు తగినంత వేసి,జీరా,
రవ్వ పోసి సిమ్ లో ఉంచి మ్రగ్గనివ్వాలి.నీరు ఇగిరిపోయే ముందు స్టవ్ ఆపేయాలి.ఆరినతర్వాత కొంచెం కొంచెం
తీసుకుని మనకు కావలసిన సైజులో ఉండచుట్టి (గుండ్రముగా చేసి)ఇడ్లీ కుక్కర్లో ప్లేట్లకు నెయ్యి రాసి పెట్టి 10ని.లు
ఆవిరి మీద ఉడకనివ్వాలి.ఇక బియ్యం రవ్వ ఉండ్రాళ్ళు రెడీ.స్వామికి నివేదన పెట్టి తినడమే తరువాయి.రుచిగా
ఉంటాయి.కావాలంటే కొబ్బరి చట్నీ కానీ,పల్లీల చట్నీతో కానీ తినవచ్చు.










































No comments:

Post a Comment