Sunday 19 April 2015

కోహినూర్ వజ్రం కన్నా జాగ్రత్తగా.........

                                                 జగదీశ్ గారు వృత్తిరీత్యా వైద్యులు.వైద్యుడయినా ఆయన కూడా సగటు మనిషే కదా!ఒకసారి స్నానానికి వెళ్ళి జారి పడటంవలన వెన్నెముక చివర చిట్లింది.ఒకసారి బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మాటల మధ్యలో వరుసకు బావ ఎలా ఉన్నావు?ఈమధ్య దెబ్బతగిలిందట కదా!తగ్గిందా?అని అడిగితే మధ్య వయసులో ఒకసారి తగిలిన తర్వాత ఎంతో కొంత నొప్పి ఉంటుంది.అందుకని ఎక్కడికి వెళ్ళినా నామోషీ అనుకోకుండా గట్టిగా పక్కన ఉన్న రైలింగ్ పట్టుకోవాలి.ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరంలో ప్రతి ఎముక కోహినూర్ వజ్రం కన్నా జాగ్రత్తగా కాపాడుకోవాలి.నాదగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళకు ఇదేచెప్తూ ఉంటాను అని చెప్పారు.   

No comments:

Post a Comment