Monday 6 April 2015

కుడుము పూర్ణాలు

పచ్చిశనగపప్పు - 1 కప్పు
పంచదార - 1 1/4 కప్పు
పచ్చి కొబ్బరి - 1 చిప్ప
యాలకులు - 5
  పై పూత పిండికి కావలసినవి :
మినప్పప్పు - 1 కప్పు
బియ్యం - 2 కప్పులు
                               పచ్చిశనగపప్పు శుభ్రంగా కడిగి ఉడికించాలి.ఆరిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. కుడుముల్లా చేసి ఆవిరిపై 10 ని.లు ఇడ్లీ కుక్కర్లో ఉడికించాలి.ఒక పళ్ళెంలో వేసి వేడిగా ఉన్నప్పుడే  పంచదార,యాలకులపొడి,కొబ్బరి కలిపి ఉండలు చేయాలి.ముందే పప్పు,బియ్యం కలిపి మధ్యరకంగా  రుబ్బి 6 గం.లు నాననివ్వాలి.ఒక్కొక్క ఉండ పిండిలో ముంచి కాగిన నూనెలో వేసి వేగనిచ్చి పేపర్ పై వేసి నూనె లేకుండా ఒక డబ్బాలో సర్దుకోవాలి.అంతే,కుడుము పూర్ణాలు రెడీ.ఇవి బయట ఉన్నా 3 రోజులు నిల్వ ఉంటాయి.ఇవి చాలా రుచిగా ఉంటాయి. 

No comments:

Post a Comment