Friday 3 April 2015

అపోహ

                                            ఇడ్లీ పిండి మిక్సీలో వేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయని చాలామంది అపోహ.పిండి మెత్తగా రుబ్బే విధానంపై ఆధారపడి ఉంటుంది తప్ప దేనిలో రుబ్బినా ఒక్కటే.మినప్పప్పుగానీ,మినపగుళ్ళు కానీ 6 గం.లు
నానబెట్టాలి.నానబెట్టే ముందే శుభ్రంగా కడిగితే నిల్వఉండటానికి కలిపే మందుల ప్రభావం లేకుండా ఉంటుంది.నానిన తర్వాత రెండు,మూడు సార్లు కడిగితే సరిపోతుంది.మిక్సీలో వేసి సరిపడా ఉప్పు, నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
1:2 చొప్పున పప్పు,ఇడ్లీ రవ్వ వెయ్యాలి.మెత్తటి పిండిలో రవ్వ కడిగి కలపాలి.ఆ రెండు కలిపిన తర్వాత చేతితో 3,4 సార్లు పిండిని గుండ్రంగా,వేగంగా కలుపుతున్నట్లుగా చేస్తే త్వరగా పొంగుతుంది.10 -12 గం.లు బయటపెట్టినట్లయితే పిండి బాగా పొంగి ఇడ్లీలు మెత్తగా వస్తాయి. 

No comments:

Post a Comment