Wednesday 15 April 2015

వృద్ధాప్యఛాయలు కనపడకుండా ........

                                         వాతావరణ కాలుష్యం వలన కానీ ఆహారంలో మార్పువలన కానీ వయసుతో పనిలేకుండానే  చర్మం తాజాగా,మెరుస్తూ ఉండటం లేదు.వృద్ధాప్యఛాయలు ముందుగా చర్మంపై ప్రభావం చూపిస్తాయి.చర్మంపై నల్లటి మచ్చలు,ముడతలు వంటివి ఇబ్బంది పెడతాయి.వృద్ధాప్యఛాయలు త్వరగా కనపడకుండా ఉండాలంటే చిన్నప్పటినుండి పిల్లలకు అన్నిరకాల పండ్లు తినడం అలవాటు చేయాలి. పాలు,పెరుగు,గుడ్లు,చేపలు తప్పనిసరిగా తినేట్లు చూడాలి.చేపలు తినని వాళ్ళు పిల్లలకు  కూరగాయలు తినటం నేర్పించాలి. 30 సంవత్సరాలు దాటుతున్నాయంటేనే ఆహారంలో మార్పుచేసుకోవాల్సిన అవసరంగా ఉంది.నిమ్మజాతి ఫలాలు రోజువారీ ఆహారంలోభాగం  చేసుకోవాలి.కారట్లు,పండు టొమాటోలు,చిలకడ దుంపలు,పాలకూర వంటివి చర్మాన్నినునుపుగా ఉంచుతాయి.పంచదార వాడకం తగ్గించుకోవాలి.ప్రత్యామ్నాయంగా తేనె వాడుకోవటం మంచిది.వారానికి రెండుసార్లు వీలయినప్పుడు గుడ్డులోని తెల్లసొన నిమ్మకాయ కలిపి ముఖానికి,చేతులకు,మెడకు పూతలా వేసి 15 ని.ల తర్వాత  గోరువెచ్చటి నీటితో కడిగేయాలి.అప్పటికప్పుడు చర్మం బిగుతుగా,నునుపుగా,తాజాగా మారుతుంది. 

No comments:

Post a Comment