Tuesday 16 June 2015

తాజా ధోరణి

                                                                       దగ్గరి బందువులనో,స్నేహితులనో వ్యాపారంలో భాగస్వాములుగా చేసుకుంటే కొన్నాళ్ళ తర్వాత ఇద్దరిమధ్యా తేడావచ్చి విడిపోవడమో లేక నష్టపోవడమో జరుగుతుంది.అలా కాకుండా తన జీవితభాగస్వామే వ్యాపార భాగస్వామి అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.అందుకని చాలామంది భార్యాభర్తలు కలిసి వ్యాపారం మొదలుపెడుతున్నారు.ఇద్దరూ కలిసే ప్రణాళికతో ఏ పనైనా చేస్తారు కనుక సమస్య ఉండదు.డబ్బు ఏమైపోతుందో అన్న బెంగ ఉండదు.ఇంటా బయటా నిశ్చింత. గడప దాటితే వ్యాపార భాగస్వాములు.ఇంటికొస్తే జీవిత భాగస్వాములు.ఇది నేటి తాజా ధోరణి. 

1 comment: