Friday 18 March 2016

సహజ పీలింగ్ ఏజెంట్

                                                                 బాగా పండిన బొప్పాయి ముక్కలు రెండు తీసుకోవాలి.ఒక చిన్న గిన్నెలో వేసి మెత్తగా చేసి దానికి ఒక స్పూను తేనె,1/4 స్పూను కలబంద గుజ్జు వేసి బాగాకలపాలి.దానికి రెండు స్పూనుల శనగ పిండి చేర్చి మొత్తం బాగా కలిపి ముఖానికి పట్టించాలి.20 ని.ల తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ముఖాన్ని చుబుకం నుండి మొదలెట్టి పైకి కడగాలి.దీని వల్ల ఎక్కువగా ఉన్న బుగ్గలు తగ్గటమే కాక ముఖానికి రక్తప్రసరణ బాగా జరిగి మొటిమల తాలుకు మచ్చలు కూడా తొలగిపోతాయి.మన పెరటిలో పండిన బొప్పాయి అయితే మరీ శ్రేష్టం.బొప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్.అప్పటికప్పుడు తాజాగా.సహజ సౌదర్యంతో ఏ వయసు వారైనా అందంగా మెరిసిపోవచ్చు. 

No comments:

Post a Comment