Saturday 5 March 2016

వారానికి మూడుసార్లు

                                                              అన్నపూర్ణమ్మ మామ్మకు ఎనభై సంవత్సరాలు వచ్చినాయి.అయినా మతిమరుపు కానీ,బి.పి,షుగరు,కొలెస్టరాల్ వంటివి ఏమీ లేవు.అవే కాదు ఎటువంటి రోగాలు తనను దరిచేరవని బల్లగుద్ది మరీ చెప్తుంది.అంత నమ్మకంగా ఎందుకు చెప్తుందంటే ద్రాక్ష పండ్లంటే తనకు చాలా ఇష్టమనీ ఎక్కువగా తింటానని అవి తింటే గుండెజబ్బులు,కాన్సర్ వంటివి రావని వాళ్ళ అమ్మమ్మ చెప్పిందని చెప్పింది.వారానికి మూడు అంతకన్నా ఎక్కువసార్లు ద్రాక్ష పండ్లు తింటే ఆరోగ్యానికి రక్షణ అని చెప్పింది.కాకపోతే శుభ్రంగా కడిగిన తర్వాతే తినాలి.గోరువెచ్చటి నీళ్ళు,ఉప్పుకలిపి ఆనీటిలోఒక 20 ని.లు నానిన తర్వాత శుభ్రంగా కడిగి తింటే మంచిది.

No comments:

Post a Comment