Thursday 16 July 2015

కాళ్ళు,మడమలు ఆరోగ్యంగా..............

                                                              కదలకుండా ఒకేచోట కూర్చుని పనిచేయటం లేకపోతే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవటం వల్ల కాళ్ళల్లో రక్తం గడ్డ కట్టడం,కాళ్ళ కండరాలు పట్టేయటం వంటివి జరుగుతుంటాయి.కనుక కూర్చున్నప్పుడు పాదాలు పూర్తిగా నేలకు ఆనించి కూర్చోవటం మంచిది.మధ్యమధ్యలో లేచి ఒక 5 ని.లు అటూఇటూ నడవాలి.రోజూ ఒక అరగంట ఉదయం,సాయంత్రం నడవటం మంచి వ్యాయామం.అప్పుడప్పుడు చెప్పులు లేకుండా గడ్డిలో నడవటం వల్ల పాదాలకు మంచిది.వారానికి ఒకసారైనా గోరువెచ్చటి నీటిలో ఉప్పు వేసి ఒక 10 ని.లు పెడితే అలసిన పాదాలకు విశ్రాంతి ఇచ్చినట్లవుతుంది.పాదాలు,మడమల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.రోజుకొకసారైనా కాళ్ళకు,పాదాలకు మాయిశ్చరైజర్ రాసుకుంటే నునుపుగా,అందంగా ఉంటాయి.ఎత్తు చెప్పులు,సూదిమొన లాంటి చెప్పులు వేసుకుంటే మడమల నొప్పులు వస్తాయి కనుక వేసుకోకపోవటం మంచిది.

No comments:

Post a Comment