Wednesday 22 July 2015

పొగడ పువ్వుల పరిమళం

                                                               తన్మయి ఊరిలో ఒక పెద్ద గ్రంధాలయం ఉండేది.ఆ గ్రంధాలయంలో రెండు పెద్దపెద్ద పొగడ చెట్లు ఉండేవి.ఆచెట్లచుట్టూ గుండ్రంగా కూర్చోవటానికి వీలుగా సిమెంటు చప్టా కట్టారు.ఊరిలో పెద్దలు,పిల్లలు రోజూ సాయంత్రం కాసేపు గ్రంధాలయానికి వచ్చితమకు నచ్చిన పుస్తకాలు ఆచప్టాపై కూర్చుని చదువుకునేవారు.తన్మయి తాతగారికి పుస్తకాలంటే చాలా ఇష్టం.ఈ పుస్తకం,ఆపుస్తకం అనే తేడా లేకుండా అన్ని పుస్తకాలు చదివేవారు.రోజూ గ్రంధాలయానికి వెళ్తూ మనుమరాలిని తన వెంట తీసుకెళ్ళేవారు.ముందు తన్మయికి పొగడ పువ్వులన్నా ఆ పువ్వుల పరిమళం అన్నాఎంతో ఇష్టం.దానికి తోడు వాళ్ళ తాతగారు పొగడచెట్టు చుట్టూ ఉన్న చప్టాపై కూర్చోబెట్టి చల్లటిగాలిలో పొగడ పువ్వుల పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఏపుస్తకం చదివినా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెప్పేవారు.చందమామ,బొమ్మరిల్లు,బాలమిత్ర వంటి పుస్తకాలు ఇచ్చి చదవటం అలవాటుచేశారు.పెద్దయిన తర్వాత కూడా అదే అలవాటుతో ఏదైనా పుస్తకం పట్టుకుంటే అది పూర్తిగా చదివే వరకూ వదలదు.తన్మయి తాతగారికి ఎనభై సంవత్సరాలు వచ్చినా రోజూ ఏదో ఒక కొత్త పుస్తకం చదవాల్సిందే.లేకపోతే నిద్ర పట్టదు.ఇంకో సంగతండోయ్!తన్మయికి పొగడచెట్టు చుట్టూ రాలిన పువ్వులు ఏరుకోవడమంటే మరీ ఇష్టం.ఆపువ్వులను తెచ్చి పుస్తకాల అలమరలో,తన బట్టల బీరువాలో వేసేది.ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే పొగడ పువ్వులు వేస్తే మంచి సువాసనతోపాటు చిన్నచిన్న పుస్తకాల పురుగులు,బట్టల పురుగులు రాకుండా ఉంటాయనితెలిసింది.అదీకాక పుస్తకపఠనం మంచి అలవాటు కదా!అందరూ ఎవరికి వీలయినప్పుడు వాళ్ళు కొద్దిసేపైనా పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మంచిది. 

No comments:

Post a Comment