Friday 17 July 2015

ఆడంబరాలకు పోయి...........

                                    నిర్గుణకు ముగ్గురు పిల్లలు.పిల్లలు అందరూ చక్కగా చదువుకుని స్థిరపడ్డారు.ఎదురింటి వాళ్ళకన్నా,పక్కింటి వాళ్ళకన్నా మనమే గొప్పగా కనిపించాలనే ఉద్దేశ్యంతో అప్పులు చేసి మరీ పిల్లలకు అతి ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసింది.ఎంత ఖర్చు పెట్టి చేసినా నాలుగు రోజులు బాగా చేశారనుకుంటారు.తర్వాత యధా రాజా తధా ప్రజా  అన్నట్లుగా ఉంటుంది.దాని భాగ్యానికి అప్పులు చేస్తే పోయినంత పొడుగూ తీర్చలేక ఇబ్బంది.తిన్ననోటితోనే గొప్పలు పోవటం ఎందుకు?అప్పులు చేయటంఎందుకు?అని మాట్లాడతారు. కనుక ఆడంబరాలకు పోయి అప్పుల పాలు కావద్దు.ఎవరికి  తగినట్లు వాళ్ళు ఖర్చు పెట్టుకోవటం ఉత్తమం.ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా బ్రతకవచ్చు. 

No comments:

Post a Comment